నాగదత్తుని కథ
135
అక్కలికి యూరకుండెను. వారందఱు నాదివసము పరమానందసాగరమగ్నులై, యననుభూత హృదయానురాగ సూచకమగు సంభాషణములచే దృటిగా వెళ్ళించిరి.
అంత మఱునాడు నాగదత్తుడు తండ్రి అనుమతిని రత్నావతిని సభకు రప్పించి అదిచేసిన క్రూరకృత్యములన్నియు బ్రజలవలన విని యుగ్గడించి యిట్లనియె. ఓసీ! రత్నావతీ! నీకు వైకుంఠము కావలసియున్నదికాదా? కందర్పుని చేత నైనదికాదు. నేనంపెదను చూడుమని పలుకుచు నప్పుడే నా పితల రప్పించి తండ్రి చేసిన ప్రతిజ్ఞాప్రకారము సిగగొరిగించి విరూపమును జేసి గాడిదపై నెక్కించి రత్నావతి వైకుంఠమునకు బోవుచున్నది. ప్రజలువచ్చి చూడుడోయని చాటించుచు వీధులన్నియు ద్రిప్పుడని తనకింకరుల కాజ్ఞాపించెను. దీనికి శిక్ష చక్కగానున్నదని యెల్లరు సంతసించిరి. రాజభటులు తదీయ శాసనప్రకారము రత్నావతి నారీతి నూరంతయు నూరేగించుచున్న వారు. ఇదియే నీవుచూచిన వృత్తాంతము విద్యావతి తల్లికంటె గుణవంతురాలని కందర్పుడు చెప్పగా నాగదత్తుడు దానికి గొంత పారితోషికమిచ్చి యంపెను. నీవడిగిన ప్రశ్నమున కిది సమాధానముగా నున్నది. కాదాఅని అడిగిన మణిసిద్ధునకు వాడు వెండియు నిట్లనియె. తండ్రీ మీకు నిరుత్తరముగా గాక మరియొకలాగున జెప్పుదురా ? దీన నాకు మిక్కిలి సంతసమైనది. తరువాత కందర్పుడు భార్యాపుత్రులతో నింటికి బోవునా? అందేయుండునా? అనినడిగిన నయ్యతి యోహో ముందురాగల వార్తలుకూడ నీకు గావలయునా? ఇంచుకయు విడువవు. కానిమ్ము. చెప్పెద వినుము. కందర్పుడు తల్లిదండ్రుల స్మరించుకొని అమ్మఱునాడే భార్యాపుత్రులతో బయలుదేరి మిక్కిలి విభవముగా గుంభఘోణమునకు బోయి అందు దనరాక వేచియున్న జననీజనకులకు సంతోషము గలుగజేసెడిని చిలుకరూపముతో నుండుటచే సుభద్ర కొంతకాల మతిక్రమించినను సమారూఢ యౌవనయై కందర్పునకు రెండవభార్యయై సకల సుఖములం జెందెను.
మఱియు దానందు బట్టాభిషిక్తుండై పుత్రకు గొన్నిదినము లుంచుకొని స్వదేశమున కనుపును. అదృష్టవంతుల కెందేగినను లాభమేయగుంగదా అనిచెప్పి మణిసిద్ధుండు శిష్యున కధికప్రహర్షము గలుగజేసెను.