4
కాశీమజిలీకథలు - పదియవభాగము.
సీ. అలరి మీయాజ్ఞనే నాచరించెదనంచు
సూచించె లేచి మరీచి యప్పుడు
మీయానతి నతిక్రమింప నేర్తునెయంచు
ననుమతి దెల్పె నయ్యంగిరస్సు
తప్పక మీరన్నచొప్పున సత్కన్య
నరసి కైకొందు నేననియె నత్రి
యంజలిపట్టి దేవా! వరించెద మంచి
వనిత నంచుఁ బులస్త్యముని వచించె
గీ. పులహుఁ డనుమోదమని ప్రీతిఁదెలిపిఁగ్రతువు
కుతుకపడె ధర్ముఁడొప్పె భృగుండు లెస్స
యనియె దక్షుఁడ సిక్ని పాణిని గ్రహించె
నపుడె నారదుఁడేమి మాటాడడయ్యె.
గీ. నారదా! దారసంగ్రహ ణముగుఱించి
మౌనము వహించితేల? సమ్మతములేదొ
సోదరులరీతి నీవు గే స్తుండవగుట
కభిమత మదేమియో తెల్పు మనిన నతఁడు.
ఉ. ఇంతికరఁబు నెవ్వఁడు గ్రహించునొ యాతఁడు భోగసంగత
స్వాంతుఁడు గాదగు న్విగతభార్యునకుం జనిలేవు భోగముల్
కాంతనొకర్తుక న్విడువగా జగమంతయు వీడినట్లె వి
శ్రాంతి జగంబువీడిన ప్రశాంతునిదేగద సౌఖ్య మెన్నఁగన్.
సీ. చపలలాలారస స్రావియై తగుమోవి
సేవింప నమృతంపుబావియనుచు
శ్లో|| ఉత్సంగా న్నారదొజజ్ఞె అనిభారతము కంఠదేశాచ్చనారదః నరదమన బ్రహ్మకంఠము దానివలన జనించినవాఁడు కావున నారదుఁ డనఁబడు చుండెను అని బ్రహ్మవైవర్తము.