రాణీసాహేబ్ కువరు
ఈమె పంజాబుదేశములోని పటియాలాసంస్థా నాధీశ్వరుఁడగు రాజా సాహేబ్ సింహుని సహోదరి. బారీదు వాబులోని నధికభాగము కధీశ్వరుఁ డగుసరదార్ జయమల్ సింహునిపత్ని. ఈమె తనసహోదరుని రాజ్యమును చక్కఁగా నేలి రెండుమూడుసార్లు యుద్ధములలో జయముఁ గాంచి మిగుల శూర యనియును రాజకార్యనిపుణ యనియును బేర్కొనంబడియె.
1793 వ సంవత్సరము మంత్రులును, ఉద్యోగస్థులును దనకు వైరు లైనందున రాజ్యముఁ దాను జక్కఁబఱుపఁజాలనని రాజాసాహెబు సింహుఁడు దెలిసికొనియెను. అంత నతఁడు తనయనుజను దనవద్దకిఁ బిలిపించుకొని యామెకు ముఖ్యప్రధానిత్వమునిచ్చెను. తదనంతరమామె కొందఱువిశ్వాసార్హులులగు నుద్యోగస్థుల సహాయమువలన రాజ్యమునం దంతటను గలుగుచున్న యన్యాయముల నుడిపి న్యాయముగాఁ బాలింపుచుఁ బ్రజలకు మిగుల హితురా లాయెను. అంతలో నామెభర్తపై నతని పాలివాఁడగు ఫతేసింహుఁడు వైరముఁ బూని యతనిని జాల తొందర పెట్టుచున్నట్టు లామెకుఁ దెలిసెను. అప్పు డామె తనసహోదరున కామాట నెఱిగించి యచటినుండి కొంత సైన్యమును దీసికొని దాని యాధిపత్యమును దానే స్వీకరించి ఫత్తేపురమున కరిగెను. అచట నీమెకును ఫతేసింహునకు