xvi
“వక్షఃపీఠే నిరీక్ష్యస్ఫటిక మణిశిలా మండలస్వచ్ఛ భాసి
స్వచ్ఛాయాం సాభ్యసూయా త్వమియమితి ముహుస్సత్య మాశ్వాసితా౽పి
వామే మే దక్షిణే౽స్యాః శ్రవసి కువలయం నాహ మిత్యాలప స్తీ
దత్తాశ్లేషా సహాసం మదన విజయినా పార్వతీ పః పునాతు"
శ్రీరాముఁడు మదన విజయ స్థానమునఁ జెప్పఁబడినాఁడు. 'శ్రీరామాం శజ' యను దళమున ముద్రాలంకారము. ఇదొక విలక్షణమైన కూర్పు.
చిత్రభోగ మహారాజు షట్చక్రవర్తులవలె, షోడశ మహారాజులవలెఁ బుడమి నేలుచున్నాఁడు. ఒకనాఁడు "హావ భావ విభ్రమ విలాస వైఖరుల్ విస్తరిల్ల మరుని సామ్రాజ్య లక్ష్ముల హరువుఁ జెందు చెలులు గొలువంగఁ గొలువుండె." ఉండఁగా "చెట్టు డిగివచ్చి నట్టుల" నొక మహాయోగురాలు వచ్చి చెంతనిల్చెను. (మల్లన రాజశేఖర చరితఘుస ఉట్టి పడ్డట్టు యోగిని యోర్తు వచ్చి, లీల నారాజశేఖరు మ్రోల నిలిచెను) రాజు లేచి మ్రొక్కి పీఁట వేయించి కూర్చుండఁబెట్టినాఁడు. ఆమె దీవెన లిచ్చినది. తరువాత నిద్దఱు లోకాభిరామయణమున దిగినారు ఆ యోగిని "ఈ నవఖండమండిత మహీస్థలి నెల్లఁ జూచిన దఁట. ఒకతెను మించిన యందగత్తె యొకతె వివిధ దేశములలో నున్నారఁట. ఆందఱి తలదన్ను ప్రపంచ సుందరి ఆయూరిలోనే యున్నదఁట. ఎవరో కాదు. సాతాని విష్ణుదాసుని పెండ్లాము. హేమవతి యఁట. హేమవతీ సౌందర్య మయిదు పద్యములతో వర్ణించెను. చివరి పద్యము లోకోత్తర చమత్కార హృద్యము.
సీ. కబరీభరమునకుఁ గందంబుసెల్లు, ను
త్పలమాలికలు నేత్రములకుఁ జెల్లు
గర్ణంబులకును మంగళమహాశ్రీ సెల్లు
గాత్రంబునకుఁ జంపకంబు చెల్లు
మధుర వాగ్వృత్తికి మత్తకోకిల చెల్లుఁ
జనుగుబ్బకవకు- మంజరియుఁ జెల్లు
బిరుదై న పిఱుఁదుకుఁ బృథివివృత్తము చెల్లు
మధ్యంబునకుఁ దనుమధ్య చెల్లుఁ