ద్వి తీ య స్కం ధ ము
131
తే.గీ. చెట్టనోములు నోచిన యట్టి నాకు నెట్టుల సుఖంబులబ్బు నీ పట్టునందు
నూయియో గోయియో చిచ్చొ రాయొ యురియొ విషమొ ప్రాణంబు లిప్పుడె విడుచుటకును.272
వ. అని వెండియుఁ దనలో నిట్లని వితర్కించె.273
క. మృతిచే ఫలమున్నదె దుః ఖితు లగుదురు తల్లి దండ్రి కేవల మది దు
ర్గతిహేతువు మృతయగు నియ్యతివకు మేలేమి దీన నగుఁ దలపోయన్.274
చ. అని తలపోసి స్నాతుడయి యంజలినంబువుబూని యేను జే
సిస దివిజార్చనాదికముచేఁ గలదేని యొకింత పుణ్య మా
త్మను గురుభక్తియుం జప హుతాశ విధానమునుం దపంబు సం
ధ్య నిగమపాఠముం గలదియైన మనుం జెలియంచుఁ బల్కుచున్.275
క. అని తోయము భువివిడిచెన్ మునిసుతుఁ డంత మరదూత ముఖ్యుఁ డొకడు
దా గనులకు నెదురై మునినందన .... సాహసంబు తగునే నీకున్.276
క. చచ్చిననెటనైన మరలి వచ్చునె ఇది వింతగాదె వనితారత్నం
బచ్చర కూతురు సనియన్ చెచ్చెర వేఱొక్కదానిఁ జేకాను మింకన్.277
క. అనవుడు విని మునిపుత్త్రుం డనిమిషుల కొసగ నొల్ల నిది దా
మనిన మనుగాక మనకున్నను మానెనుగాక మృతియ నాకును నిజమౌ.278
క. అనిన విని వీఁడు సాహసమును జేయక మానఁడనుచు మునితనయా నీ
కు నుపాయము చెప్పెద వినుమా కృతకృత్యులైరి విబుధులె దానన్.279
క. నీయాయువునందును సగ మీయఁగఁదగు నట్లు చేసితేనియుఁ బ్రియురా
లీయెడ మరల బ్రతికి నిను బాయక వర్తిల్లుననగ బరమ బ్రీతిన్.280
క. నాయాయువునం దర్థం బీయెడ నీ నిముషమున యిచ్చెద దడవే
లా యువతిం బ్రతికింపుము నా ........281
వ. అనిన నంత దనసుతమరణం .... స్వర్గంబు నుండి విశ్వావసుండును వచ్చినం గాంచి
దేవీభటుం డతనింగూడి యముని సమీపంబునకుం జని 282
తే గీ. రవితనూజాత పరమధర్మస్వరూప వినుము విశ్వావసుని బిడ్డ బృథిని రురుడు
వలచెఁ గన్యఁ బ్రమద్వరఁ మనమునందుఁ బాముగఱచినఁ ....నప్పడతి దలఁచి.283
తే.గీ. స్రుక్కిప్రాణంబువిడువంగఁ జూచుచున్న ! వాఁడు రురుఁ డతఁడెంతయు వగచి యాయు
వందు సగమిత్తుఁ బ్రతికింపు మనుచుఁ బలికె వలపు లట్టివ యెంతటివారికేని.284
క. కావున దానికిఁ బ్రాణం బీవలయునటన్న దూత నెఱిఁగి యముం డ
ట్లావనిత బ్రతుకుఁ బొమ్మన వేవేగమ వచ్చి దూత వెలఁది న్మనిచెన్.285