పుట:భాస్కరరామాయణము.pdf/424

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వుండు సుగ్రీవప్రభృతులుం దానును మంత్రాలోచనంబు సేయునవసరంబునఁ
బ్రసంగం బగుటయు విభీషణుం డి ట్లనియె.

431


తే.

మూఁడులోకంబులకు నెడ్డముల్లువోలె, నున్నదశకంఠురక్షచే నొప్పు మిగిలి
దివిజదనుజదుస్సాధ మై తేజరిల్లు, చుండు లంకానగర మప్పురోత్తమమున.

432


క.

అఱువదిలక్షలు రావణు, నుఱుబాహుబలంబువీరు లొగి నాలములం
గఱకెక్కినారు వారం, దఱు మూలబలంబుదొరలు ధరణీనాథా.

433


తే.

కరులుఁ దేరులు వాజులుఁ గాల్బలంబు, వేయుఁ బదివేలు నిరువదివేలు లక్ష
వేలు గలలెక్కప్రో వది వినుము సార్ధ, కోటిభటులును గోటానఁగోటు లధిప.

434


క.

తక్కిననాయకబలమును, లెక్కింపఁ బితామహుండు లేఁ డనఁ దగుచుం
గ్రిక్కిఱిసి యుండుఁ బురిలో, దిక్కులఁ దమయంత నుప్పతిల్లినభంగిన్.

435


క.

అం దెంతబలము గలిగిన, నెందఱు రథనీశు లున్న నే మగు నీ చే
నందఱతోఁ జను నాసం, క్రందసరిపుఁ డనుజుఁ డైనఖరునిం గూడన్.

436

విభీషణమంత్రులు రావణువృత్తాంతంబు రామునకుం జెప్పుట

వ.

అని చెప్పి నామంత్రులు లంకకుం జని వే గరసి వచ్చిరి రావణుండు సమరంబు
సేయువాఁ డై దుర్గరక్షణం బొనర్చుకొనియున్నవాఁ డత్తెఱంగు మీకు సమ్ము
ఖంబున నవధరింతురు గా కనుచు నయ్యనలసంపాతిప్రముఖుల నలువురం దెచ్చి
ముందటం బెట్టుటయుఁ బ్రణతు లై కేలు మొగిచి వార లి ట్లనిరి.

437


శా.

దేవా దేవరబంటు వేగు పనుపన్ దేవారివీ డొక్కమా
యావిద్యాగతిఁ బక్షిరూపములు నొయ్యం జొచ్చి యే మాదశ
గ్రీవుం డున్నతెఱంగు నందుఁ గలవారిం దత్పురద్వారర
క్షావిన్యాసముఁ జూచి వచ్చితిమి విస్పష్టంబుగా నంతయున్.

438


వ.

అవ్విధం బవధరింపుము.

439


ఉ.

బుద్ధులు మాల్యవంతుఁ డొగిఁ బోలఁగఁ జెప్పిన మండి నీ వసం
బద్ధపుమాట లాడిన నృపాలతనూభవ నేను బుత్తునే
యుద్ధ మొనర్తుఁ గా కనుచు నుద్ధతుఁ డై యతఁ డున్నవాఁడు స
న్నద్ధపదాతివాజిరథనాగసమాకులసైన్యకోటితోన్.

440


శా.

గర్వస్ఫూర్తులు కాలమేఘములు నా గర్జిల్లుచున్ రాక్షసుల్
దుర్వారోద్ధతిఁ బంతముల్ పలుకఁగాఁ దోరంపుసైన్యంబుతో
నుర్వీచక్రము మ్రింగిపుచ్చు ననున ట్టున్నాఁడు లంకాపురీ
పూర్వద్వారమునం బ్రహస్తుఁడు ముదంబుం జేవయుం జూపుచున్.

441


క.

పురిదక్షిణంపువాకిట, ధరణికి వేఁ గైనయట్టిదారుణదర్ప
స్ఫురణ మహాపార్శ్వమహో, దరు లనువా రున్నవారు దళములతోడన్.

442


చ.

కడిఁదిమగంటిమిం దొడరి కయ్యమునం దనబాహుదర్ప మే