పుట:భాస్కరరామాయణము.pdf/419

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


డనువానిం బిలిచి పరమరహస్యంబుగా నద్దశాననుం డతని కి ట్లనియె.

377


క.

శరములు నొకవిలు మాయా, శిరమును గొనిపోయి చూపి సీతా యిదె నీ
పురుషునిఁ జంపితి మని నీ, వెరవు మెఱయవలయుఁ గపటవిద్యాచతురా.

378


వ.

అని పలికి తాను నశోకవనంబునకుం జని.

379


తే.

పలుచఁ బాఱిననునుఁజెక్కు పాణిపంక, జమునఁ జేర్చి యందంద బాష్పములు దొరఁగఁ
గూరువగలఁ గుందుచు నట్లు ఘోరరాక్ష, సీసురక్షిత యై యున్నసీతఁ జూచి.

380


క.

నీకొఱకై యత్నంబు ల, నేకంబులు సేసి మొదలు నెలనాఁగ నినుం
బైకొని వేఁడఁగ నన్నుం, గైకొన వై తెట్లు నింకఁ గైకొందు గదా.

381


ఉ.

ఎవ్వరు దిక్కు నీకుఁ గల రేమిటి కింతచలంబు లోకముల్
మువ్వరుసం గలంచి తుద ముట్టినన న్నవధీరణంబునం
బువ్వులు దూపు లైనవెడపోటరిబారికిఁ ద్రోచినట్టినీ
క్వ్వఱ నాఖరాంతకుఁడు గూలెఁ జుమీ సమరాంగణంబునన్.

382


క.

ఇట మీఁ దెవ్వరికిం దె, ల్లటిగా నీ విట్టు లునికి లలనా న న్నే
లుట మూఁడుజగంబులు నె, క్కటి యేలుట గాదె రాము కథ [1]మఱు మింకన్.

383


వ.

వినుము తదీయవధప్రకారం బతండు కపులం గూర్చుకొని కడలిఁ గడచి దక్షిణ
కూలంబున విడిసె నని వేగులవారిచేత నెఱింగి యేను బ్రహస్తప్రముఖంబుగా
నిఖిలబలంబును గూర్చి పోటునకుం బనుచుటయు నర్ధరాత్రివేళ నవ్వేలంబు సొచ్చి
పథిపరిశ్రాంతి నిద్రాపరవశు లై యుండఁ బ్రచండగతి రక్కసులు పెక్కుముఖం
బులం గదిసి ముద్గరపరిఘపట్టిసప్రాసఖడ్గచక్రాదుల సుగ్రీవజాంబవదాంజనేయ
మైందద్వివిదముఖ్యు లైనబలీముఖుల వధియించిరి ప్రహస్తుండు మస్తకంబు ద్రుం
చి రామచంద్రు నస్తమితుం జేసె హతశేషు లైనవానరులును లక్ష్మణుండును
రయంబునం బాఱి సముద్రంబునం బడి రదె పురంబునం జెలంగెడు మదీయవిజ
యభేరీధ్వను లాకర్ణింపు మతనితలయుం దెత్తు రింతకు ననునంతలోన విద్యుజ్జి
హ్వుండును సంభ్రమంబునం బఱతెంచి రావణునకు మ్రొక్కి తన్నియోగంబునం
దన తెచ్చినశరశరాసనశిరంబులు సీతముందటం బెట్టి చనియె నంత నంతర్గ
తంబున.

384


చ.

పవనతనూజుచేత వినఁబడ్డ విభాకరసూనుతోడి బాం
ధవము నిజంబు నిక్కమొకొ దైవము యీచెడువార్త యంచు బి
ట్టవిసినయుల్లముం దొరఁగునశ్రులు నై యటు లుండి పోల న
య్యవనిజ చూచి రాముశిర మౌ నని మూర్ఛిలి వ్రాలె భూస్థలిన్.

385
  1. నుఱు మింకన్.