పుట:భాస్కరరామాయణము.pdf/412

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


డక్కపటక్రమం బెఱిఁగి యారజనీచరచారయుగ్మమున్.

307


వ.

వనచరులచేతం బట్టించి కొనివచ్చి రఘుపతిముందటం బెట్టి యి ట్లనియె.

308


క.

వీరలు శుకసారణు లను, వారలు దశకంఠువేగువారలు కపటా
కారములు పూని మర్మము, లారయుచుండుదురు తిరిగి యఖిలజగములన్.

309


వ.

అని యతండు విన్నవించిన నన్నిశాచరులు భయకంపితాంగు లగుచుం గేలు
మొగిచి.

310


క.

దేవా దూతలము దశ, గ్రీవుఁడు పుత్తేర నిట్లు కృత్రిమభంగిన్
దేవరసైన్యము చూడం, గా వచ్చినరాక తప్పు గల దని పలుకన్.

311


క.

అల్లన నవ్వుచు నజ్జన, వల్లభుఁ డను దూత లయ్యు వధ్యులు మీరల్
ముల్లోకములకు డెందము, ము ల్లగుదశకంఠుతోడిమ్రుచ్చుల రగుటన్.

312


తే.

అయిన నల్పుల మిముఁ జంపినప్పు డేమి, గలుగు నటుగాని వెఱవ కీబలము నొనరఁ
జూడవలయునంతయుఁ జొచ్చి చూచిపోయి, పంక్తికంధరుతోడ నాపలుకు గాఁగ.

33


క.

క్షితిసుత నేలావునఁ దెచ్చితి నీ వాలావు సకలసేనలతో నా
జితఱిం జూపుచు నాశర, తతి కించుక సైఁపు మనుము దర్ప మెలర్పన్.

314


మ.

దిననాథుం డుదయాద్రిశృంగమున కే తే నెల్లి మారీచర
క్తనిషిక్తం బగునాశరంబు మునుగా ధారాళ మై ఘోర మై
ధనురభ్రంబునఁ బుట్టునంపజడిచేతం గూల్తు లంకాపురీ
ఘనసాలాదుల నేలమట్టముగ నాకంపింప నక్తంచరుల్.

315


క.

అని పలికి వీడుకొల్పిన, వినతు లగుచు దేవ నీవు విజయశ్రీ గై
కొను మనుచుఁ జక్క లంకకుఁ, జని చేతులు మొగిచికొని దశగ్రీవునితోన్.

316


వ.

నిశాచరేశ్వరా యేము కపిసైన్యంబు సొచ్చి సర్వంబు నరయునెడ విభీషణుం
డెఱింగి మముఁ బట్టించి వనచరుల కొప్పించి రఘుపతిముందటం బెట్టించిన నమ్మ
హాత్ముండు కరుణించి విడిచి పుత్తెంచిన వచ్చితి మంతయు నంతకుమున్న చూచి
నారము విన్నవించెద మవధరింపుము.

317


ఆ.

బాహుబలము నస్త్రబలము విచారింప, రాముతోడ సంగరమునఁ దొడర
వీరుఁ డెందుఁ గలుగనేరఁ డమ్మహితాత్ము, ననుజుఁ జూచినపుడు నట్ల తోఁచు.

318


ఖరకరసూనుఁ డుగ్రబలగర్వితుఁ డాతనిఁ జెప్పనేల త
డుగ్రజల
త్పరిసరవర్తు లై గిరులతాత లనం గపియూథనాథు లు
ద్ధురగతి నున్నవారు రణతదోహలు లందఱు యామినీచరే
శ్వర మనకం దొకం డొకఁడ చాలు నజయ్యులు వార లారయన్.

319


క.

నాఁడు మనలంకఁ గాల్చిన, వాఁడును నీలుండు నలుఁడు వాలిసుతుండున్
వాఁడిమగలు సమరమునకు, మూఁడవకను లేనిరుద్రమూర్తులు వింటే.

320


వ.

దశయోజనవిస్తృతంబును శతయోజనాయతంబునుగా సేతు వొనర్చి కడలి గడచి