పుట:భాస్కరరామాయణము.pdf/276

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జేపడ సంచితోపకృతి చేసినవానికి వాంఛితంబు సం
క్షేపమనస్కుఁ డై తనరఁ జేయనివాఁడును బూరుషాధముల్.

420


క.

ఉపకృతుఁ డై యుపకారికి నుపకారం బిచ్చఁ జేయకుండు కృతఘ్నుం
డపగతుఁ డైనం దద్గా, త్రపరీతామిషముఁ దినవు క్రవ్యాదములున్.

421


వ.

అని మఱియును.

422


శా.

ఉద్యజ్జ్యాలత ఘోరఘోషయుతవజ్రోగ్రధ్వనిన్ మ్రోయఁగా
విద్యుత్సంఘముభంగి వ్రాలెడుసమిద్వీరాహితత్రాససం
పాద్యస్మత్పటుదోర్వికష్టఘనచాపం బాజిలోఁ జూడఁగా
నుద్యోగింపు యమాలయంబు చొర నీ కుత్సాహ మేపారినన్.

423


మ.

మదవృత్తిం గడు వాలి వాలి తనకున్ మా ఱెందు లే దంచు ను
న్మదుఁ డై యుండఁగ నీకుఁ బూని రఘురామక్ష్మావిభుం డుగ్రుఁ డై
కదనోద్దండత నొక్కయమ్మునన వ్రక్కల్ సేసె నవ్వాలి నా
ప్రదరం బిప్పుడు మొక్కవోదు నినుఁ ద్రుంపం జాలుఁ గ్రొవ్వాఁడిమిన్.

424


మ.

జగతీనాథునితోడ నాడిన ప్రతిజ్ఞావాక్యముం జేసి స
త్యగరిష్ఠుండవు గమ్ము రాఘవునమోఘాస్త్రంబునం ద్రెళ్లి వే
గ గతప్రాణుఁడ వై మహోగ్రయమలోకం బేఁగి యచ్చోటఁ బ్రే
తగతిం బొందినవాలిఁ జూడకు సముద్యద్బుద్ధిహీనుండ వై.

425


మ.

అని సుగ్రీవునితోడ నాడు చను మం చారాముఁ డుద్వృత్తిఁ బం
చిన సౌమిత్రి మహోగ్రచాపశరముల్ చేఁ దాల్చి యత్యుగ్రుఁ డై
జననాథాగ్రణితోడ ని ట్లనియె నాశాతాశుగశ్రేణిచే
నినపుత్రున్ విదళించెదం దునిమెదన్ హింసించెదం ద్రుంచెదన్.

426


క.

అచ్చుగ సీతన్ వెదకం, బుచ్చనియాఖలుని మద్విపులబాణములం
గ్రుచ్చినఁ జచ్చి ప్రియంబునఁ, జెచ్చెర మఱి పుచ్చుఁ గాక సీతన్ వెదకన్.

427


క.

అనుచును రోషావేశం, బున మండుచు నున్నయనుజు భూవిభుఁడు ప్రియం
బునఁ గనుఁ గొని కారుణ్యం, బెనయఁగ శాంతవచనముల ని ట్లని పలికెన్.

428


క.

ఇనజున కె గ్గొనరింపకు, మనుజుఁడ నినుబోఁటిసుజనుఁ డఘముం గావిం
చునె యన్యునిభంగి నఘము, చన నెవ్వఁడు చెఱుచు వాఁడ సత్పురుషుఁ డిలన్.

429


తే.

కావునను నీవు సుగ్రీవు గాన నేఁగు, మతనితోఁ దగ సామంబు లాడు నిష్ఠు
రంబు లాడకు మనకుఁ గార్యంబు గలదు, ననిన నౌ నని యన్న వీడ్కొని యతండు.

430

రామప్రేషితుఁ డై లక్ష్మణుఁడు సుగ్రీవునిఁ గానఁబోవుట

సీ.

దండధరోద్దండదండంబుకరణిఁ గో, దండంబు తనదుహస్తమున నమర
భూరిరోషస్ఫుటభ్రూకుటి భీకర, ప్రళయకాలాంతకుపగిదిఁ గడఁగ
నురుమారుతోద్ధతి నూరువేగంబున, వృక్షషండంబులు విఱిగి కూలఁ