206
కాశీమజిలీకథలు - ఐదవభాగము
గీ. తెలియకెవ్వరినైన నిందించియిట్టి
వెతలగాంచితి నేనిసద్వృత్తినిపుడు
మాన్పికొనియెద నా బుద్ధిమాంద్యమెల్ల
వేగ రక్షింపరయ్యయో వేల్పులార!
అని ప్రార్థించుచున్న సమయంబున నాప్రాంతమందు నూరేండ్లుప్రాయము గలిగి శరీరమంతయు ముడుతలు బారినను బండుటాకు వంటి కాంతితో నొప్పుచు వింతశోభ సంపాదింపఁ జనురీవాలంబులం బోలె నొప్పారు నెరసిన వెండ్రుకలు ధమ్మిల్లముగా దిద్దికొని సుందర ఫాలంబునఁ జంద్రవంకంబోని కుంకుమ రేఖందీర్చి కుడిచేత దండం బూతగాఁబూని నిలువంబడి రెండవచేయి యళికంబున సూర్యకిరణ ప్రసారమున కడ్డముగానిడి యొకవృద్ధాంగన అయ్యా ! దారిఁ దెలియక యిక్కడఁ జిక్కులుపడుచుంటిని. సన్మార్గమేదైన మీకుఁ దెలిసినచో వక్కాణింపుదురాయని బురదలోఁ జిక్కి కొనియున్న శంకరాచార్యు గూర్చి పలికినది.
ఆ ధ్వని విని యతం డబ్బురపాటుతోఁ గన్నులందెరచి యాప్రాంతమందు దండమూతగాఁబూని నిలువంబడియున్న జరాంగనంగాంచి విస్మయము జెందుచు ఆవ్వా! నేను దారి తెలియకయేవచ్చి యీ బురదలోఁ జిక్కుకొనియుంటి దీనిందాటివచ్చుటకు శ క్తిలేకున్నది. నీ దండము గొంచెమూత యిత్తువేని దీనివెడలి రాఁగలనేమోయని యాసగలుగుచున్నదని పలికిన నవ్వుచు నావృద్ద యిట్లనియె. సౌమ్యా ! నీ మాటలు వినఁ గడు చిత్రముగానున్నది నేనీదండమం దిచ్చినంతనే లేని శక్తి యెట్లువచ్చెడిని. అదియునుంగాక నేను నూరేండ్లదాన నీవు ప్రాయములోనుంటివి. శక్తిలేదని చెప్పినను నీవంటివారు పంకమునుండి యుద్ధరింప సమర్థులుకాని మేమట్టి వారముకాము. మాబోటులున్నను లేనివారలలోనే లెక్క నీయభిప్రాయమట్లేయున్నది గదా! పోనిమ్ము నాకీవితర్కమేల మంచిమార్గ మెరింగియుండిన వక్కాణింపుము లేకున్న నాకుఁదోచిన దారింబడిపోయెదనని పలికినంత మేనంబులక లుద్భవిల్ల నాచార్యవర్యుండు చేతులెత్తి మ్రొక్కుచు దేవీ! నీవాదిశక్తివని తెలిసికొంటి నిన్ను లేదని వాదించిన యపరాధంబున కీశిక్ష విధించితివికాఁబోలు.
శా. దేవీ! పురాణశక్తివి భవ ద్దివ్యప్రభావంబు మా
యా విష్టాత్మ గ్రహింపనేర కటుల న్యఖ్రాంతి వర్తించితిన్
గావంగాఁదగు నీదుభక్తుఁగరుణన్ గాయత్రి సావిత్రియున్
నీవే యాత్మవటంచు నేడెరిగితిన్ నిక్కంబు గాత్యాయనీ.
అని స్తుతియించినంత సంతసించుచు నద్దేవి దివ్యరూపంబుధరించి యయ్యతి శేఖరు నాజంబాలంబునుండి లేవనెత్తి యొడలు నివురుచు నల్లన నిట్లనియె.
వత్సా ! శంకర ! నీవుత్తమ తత్వజ్ఞాన సంపన్నుండవగుదువు పరమార్థోప