గ్రామ కైఫియ్యత్తులు: గుంటూరు తాలూకా (మొదటి భాగము)/పెదపణిదం

పెదపణిదం

కయిఫియ్యతు మౌజే పెదపణిదం సముతు మునుగోడు సర్కారు

మృత్యు౯జాంన్నగరు తాలూకె చింత్తపల్లి స్న౧౨౨౨

(1812 A.D.) ఫసలి.

యీ గ్రామాన్కు పూర్వంనుంచ్చి పెదపణిదం అనె పెరువుంన్నది. గజపతి శింహ్వాససస్థుడయిన గణపతిదెప మహారాజులు ప్రభుత్వము చెశెటప్పుడు విరిదగ్గర మహా ప్రధానులయిన గోపరాజు రామంన్నగారు శా ౧౦౬౭ (1145 A.D ) శకమంద్దు ప్రభువు దగ్గిర దానంపట్టి సమస్తమయిన నియ్యోగులకు గ్రామకరిణీకపు మిరాశీలు నిన౯యించ్చే యడల యీ గ్రామాన్కు వెలనాడు కాశ్యప గోత్రులయిన యద్దనపూడివారి సంప్రతిం కాశ్యప గోత్రులయిన మత్కుమల్లివారి సంప్రతి ౧ యాజ్ఞవల్క్యులు కొండ్డవారి సంప్రతి ౧ వెరశి మూడు సంపత్రులవారికి మిరాశీ యిచ్చినారు. తదనంత్తరం రెడ్లు. ప్రభుత్వానకు వచ్చి రాజ్యం చెశెటప్పుడు అనవెమారెడ్డింగ్గారు గ్రామానకు తూర్పు పాళ్వన్ మంద్దు శివాలయం కట్టించ్చి శ్రీ సోమేశ్వరస్వామివారనె లింగమూతి౯ని ప్రతిష్ఠచేశీ గ్రామమధ్యమంద్దు విష్ణుస్థలం కట్టించ్చి శ్త్రీ కళ్యాణ గోపాలస్వామివారిని ప్రతిష్టచెశి స్వామివాల౯కు నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ ఆయనోత్సవ సంవ్వత్సరోత్సవములు జరగ్గడానకుంన్నూ నిత్యనయివెద్య దీపారాధనలు జరుగగలంద్దులకు గ్రామాన్కు ఆజ్ఞయభాగమందు కు ౧౨ ఖండ్రికె యినాం యిప్పించ్చినారు. గన్కు వడ్డెరెడ్డి కన్నా౯ట్క రాజులు ధర్మస్థులయి నంద్ను శా ౧౫౦౦ శకం (1578 A. D.) వర్కు ప్రభుత్వం చే సదరహిస్వామి వాల్ల౯కు భోగరాగాలు జరిగించ్చినారు.

శా ౧౫౦౨ శకం (1580 A. D.) లగాయతు యీ దెశాన్కు మొగలాయి ప్రభుత్వము వచ్చె గన్కు మల్కి విభురాహీము పాదుశాహగారి తరబున అమీనను వారు యీ సరకార్కు ఆమీలై వచ్చి శ్రీ స్వామవాల౯కు పూర్వపు రాజులు నిన౯ యించ్చిన ఖండ్రికే కాష్ఠకింద్దను దాఖలుచెస్కుంన్నారు. తదనంతరం పాదుశాహిలు కొండ్డ విటిశిమ సముతు బంద్ధిలు చెశెటప్పుడు యీ గ్రామము మునుగోడు సముతులొ దాఖలు చేసినారు గన్కు చౌదరు దెశపాండ్యాల పరంగ్గా అమీళ్లు అమాని మామ్లియ్యతు జర్గించ్చే యడల మజకూరిలో వున్న స్వామివాల౯కు నిత్యనయి వెద్య దీపారాధనల్కు కు ౪ భూమి యినాం యిప్పించ్చినారు శా ౧౬o2 (1685 A.D.) శకం లో వచ్చిన క్షయ సంవత్సరము సంద్దు సంభవించ్చిన మహాక్షామమంద్దు గ్రామాదులలో ప్రజలు బేజారు అయి గ్రామాదుల నుంచ్చి లేచి ఆంన్యదేశములకు వెళ్లడమాయగన్కు అప్పట్లో మజుకూరిలోవుంన్న సోమేశ్వరస్వామి కళ్యాణ గోపాలస్వామివారి ఆలయములు అచ౯నాదులు జరుగక ఖిలపడిపోయినవి స్న ౧౧౨౨ ఫసలి (1712 A.D.) లో కొండ్డవీటి సీమ మూడు వంట్లుచేశి జమీదాల౯కు పంచ్చిపెట్టె యడల యీ గ్రామం వాశిరెడ్డి పద్మనాభునింగ్గారి వంత్తువచ్చి చింత్తపల్లి తాలూ పెదపణిదం కాలో దాఖలు అయినది గన్కు పద్మనాభునింగ్గారు చంద్రమౌళిగారు పెదరామలింగ్గంన్నగారు నర్సంన్నగారు చినరామలింగంన్నగారు జగ్గయ్యగారు రామన్నగారు సభుత్వము చెశిన తర్వా తను రాజా వెంక్కటాద్రినాయుడుగారు బహుద్దరు మన్నెసులతానుగారు ప్రభుత్వం చెస్తూ స్న ౧౨౦౦ (1790 A. D.) ఫసలి పరిధావి నామసంవత్సరములో పూర్వకమయిన కళ్యాణ గోపాలస్వామివారి ఆలయం మరాకుతుచేయించ్చి శ్రీ స్వామివారిని సంప్రోక్షణ చెయించ్చి పూజించ్చడాన్కు పరాశరం గోపాలాచార్యులు అనె విఘానసుంని నినయించి యీ స్వామివారి నిత్యనయివెద్య దీపారాధనలకు కు భూమి యినాం యిప్పించి యిదివర్కు ప్రభుత్వము చేస్తూవుంన్నారు. గ్రామం గుడికట్టు కుచ్చెళ్ళు ౧౦ బారల పగ్గాన కుచ్చెళ్లు కి ౬ కుంటల ప్ర్రాప్తిని ౧౨౦ కి మినహాలు 3 గ్రామకంఠం దీపాల దిన్నెపాలెం సమేతు మజుకూరు దీపాల దిన్నేపాలెం 6 2 వనం తోటలు 3 కి 6 3122 01 2 ou 4 - 6 62 62 6 2 గ్రామానకు తూపున్ జవ్వాది నర్సుతోట వంకీ గ్రామానకు ఆగ్నేయభాగం కాల్లా మూతిన్ తోటంకి గ్రామానకు దక్షిణం పంచుమతి రాముడు తోటవంకి చరువులు కుంట్టలు కీ కి యినాములు గ్రామానకు పడమర వూరచరువు కి గ్రామానకు ఆగ్నేయం పంచ్చు మత్తికా రాముడు చర్వుంకి మరిఁన్నీ ఆగ్నేయభాగం ధూళివాళ్లు అయ్యవారి చర్వుంకి గ్రామానకు తూర్పు కట్టాకోటప్ప కుంట్ట వంకి మరిఁన్ని తూర్పు పుల్లయ్య కుఁట్ట వంకి గ్రామానకు యీశాన్య భాగం కబళ అప్పయ్య కుఁట్ట వంకి వాగులు కాల్వలు డొంక్కలు బాటలు సైద్యానికి పనికిరాని పొలం చవిటి భూమి ? 4 0 గ్కాతతిమ్మా FelO 89 శ్రీకళ్యాణగోపాలస్వామివారు శ్రీఆంజనేయస్వామివార్కి గ్రామపురోహితులకు గ్కా నిలువ ౯౨40 సావరం 840 శీముఖనామ సంవత్సర జ్యేష్ఠశుద్ధ ౧౨ (12) గురువారం ది ౧౩ (11) జూను ఆన ౧౮౧౩ (1818) సంవత్సరం.